సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • రాష్ట్ర శ్రేయస్సు కోసం లోకేశ్, బ్రాహ్మణి దంపతుల రుద్రాభిషేకం
  • హైదరాబాద్ నివాసంలో మంత్రి లోకేశ్ దంపతుల ప్రత్యేక పూజలు
  • ఏపీ ప్రజల సంక్షేమం కోరుతూ మహాశివుడికి లోకేశ్ పూజలు
  • లోకేశ్, బ్రాహ్మణి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వారు మహాశివుడికి ఈ పూజలు చేశారు.

పవిత్రమైన సోమవారం సందర్భంగా, వేద పండితుల మార్గదర్శకత్వంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పరమశివుడి ఆశీస్సులు కోరుతూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.

రుద్రాభిషేకం అనంతరం లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోరుతూ మంత్రి దంపతులు ఈ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రుద్రాభిషేకం ఫొటోలను పంచుకున్నారు.

Nara Lokesh
Nara Brahmani
Rudrabhishekam
Andhra Pradesh
Shiva Puja
Hyderabad

More Telugu News